సాక్షం దాచని చీకటి నేను
కరుణే ఎరుగని ఖడ్గం నేను
బండగ మారిన వృక్షం నేను
సుగంధమెరుగని పుష్పం నేను
స్వార్ధం కమ్మిన సాధువు నేను
నేనే నేనను అహంకారినే నేను
ప్రలోభాలతో పాతుకుపోయానేను
వీరుడ్నినేను, సూరిడుడ్ని నేను
నా శవానికింత పాడైన కట్టే
ఓపిక లేని పరాక్రమశాలిన్నేను
తరాలుతరగని ఆస్థులకైతే అధిపతినేను
ఆరడుగులకే నోచని నేను
శవాన్ని నేడు శవాన్ని నేను !!
...............య.వెంకటరమణ
"పదిమందికి సాక్షంగా ఉండలేని చీకటిమనిషిని నేను,నాలో దయా దాక్షన్యాలు లేక సాటిమనిషి సైతం చంపి జీవించు స్వార్ధజీవిని నేను,వృక్షంలా పదిమందికి నీడనీయగల నేను, నేడు జీవంలేని మ్రానులా మారిపోయాను. నాలో ఎలాంటి పరిమళమూ లేదు.దేవుని పోలికలతో ఉన్న నేనో స్వార్ధపరుడ్ని. అహంకారిని. ప్రలోభాలు నాలో పాతుకుపోయాయి.ఏమైనా చేయగల వీరుడ్ని సార్వాబౌముడ్ని, ధనికుడిని అనుకునే నేను చనిపోయిన తర్వాత నా పాడి నేను కట్టుకోలేను, నా యంత నేను సమాధి కాలేనని మరిచిపోయి స్వార్ధప్రలోభభరితుడినై ఆస్తులంటే పోగుచేసుకున్నాను కానీ అందుకు నాకోసం నేనో నలుగురి మనసుల్ని సంపాదించుకోలేకపోతున్నాను.ఎన్ని సంపాదించినా నాఆస్తులు నాతో రావనీ , చివరికి నా శరీరం కూడా నాది కాదని. నా శరీరాన్ని పాతిపెట్టిన ఆ సమాధిలో కూడా నేనుండలేనన్న విషయమే మరిచిపోతున్న మనిషిని నేను .. శవంగా మారి మట్టిలో కలిసిపోయే మనిషిని నేను."
No comments:
Post a Comment