Tuesday, April 7, 2015

జాతీయపతాకం

ఆగష్టు పదిహేనొచ్చేస్తుంది.
అదిగదిగో గుమ్మంలో నిలబడి ఉంది.
ఆశలతో ఎదురెల్దాం,ఆనందంతో ఆహ్వానిద్దాం.
అక్కడక్కడా అపసృతులుంటే అక్కడికక్కడే సరిచేద్దాం.
అబసుపాలది కాకుండా జాతీయ ఝండా నిలబెడదాం.
ముల్లోకాలను మురిపించేది మూడు రంగులా మన ఝండా.
మీదా క్రిందా తెడాలెరిగి  మున్నుకు ఎగురగ చూపెడదాం
ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం,
"హుందాతనం, సంయమనం, లాభాపేక్ష లేకుండటం, త్యాగనిరతి,
నిజాయితీ, ఖచ్చితత్వం, న్యాయం, దయ, ఆహ్లాదం, ఆర్ద్రత,
ధర్మాధర్మ విచక్షణ, జాలి, భగవంతునిపట్ల ఎరుక, ఈశ్వర జ్ఞానం,
నైతికత, పాపభీతి, భగవంతునిపట్ల శ్రద్ధ, ఆసక్తి, భక్తి విశ్వాసాల"
ఇన్ని నిండినా అశోకచక్రం ఒక్కో రేఖతో ఇరవై నాలుగు
కలచాక్రమది గిరగిర తిరుగుతూ మళ్ళీ మొదలవు
అశోకచక్రపు ఆనవాలుగ వెలిసెను చూడు ఆనవాలుగా
ధర్మపాలనకు అదియొకగురుతుగ-ధర్మపాలనకు అదియొకగురుతుగ.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, నీలివర్ణము అశోకచక్రం
ఉప్పొంగిపోయే నినాదమదిగో "ఝండా ఊంఛా రహే హమారా..."
జాతీయ పతాకమంటే జాతికి చిహ్నం.మరువకు నేస్తం మరువకు నేస్తం
మురిపించే మువ్వన్నె చిహ్నం.జయహే జయహే జయ జయ జయ జయహే!!

( జాతీయ జెండా అవమానాలపాలు కాకుండా కాపాడుకొనే భాద్యత మనందరి మీదా ఉందని మరువకండి.)

........................................................యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment