Tuesday, April 7, 2015

యుద్ధం

స్పృహలో ఉండి,యుద్ధంచేసా
ఫలితంగా నే అపజయమొందా .
ఆచీ తూచీ అంచనవేస్తే
కోల్పోయిందీ అర్థరాజ్యమే.
గెలిచినవాటికి లెక్కలు వేస్తే
ఒకటారెండా?వేలకువేలు
నేలకు వరిగిన సిపాయిలాళ్ళు.
గెలుపనుకుంటూ ఓడినప్రాణం
వెలకట్టేందుకు వెయ్యఁలెక్కలు
లేనేలేవే అంకెలు ఇంకేన్.
స్పృహకోల్పోయి యుద్ధంచేసా.
పోగులుపడ్డ శవాలపైన
పోరుకుపోయీ జయించుకొచ్చా.
పోయినప్రాణం ఖరీదు కడుతూ,
లెక్కలు గట్టఁ అంకెల్లేక ,
స్పృహలోఉండే యుద్ధంచేసా.
ఓడిందంతా జయించుకొచ్చా!!

.......య.వెంకటరమణ

No comments:

Post a Comment