Sunday, April 5, 2015

ఎవరని యడిగితే,ఏమనిచెప్పను?

ఎవరని యడిగితే,ఏమనిచెప్పను?
ఎవరూ ఎరుగని ఛాయ న్నేను.
ప్రేమకు గురుతు రచనన్నేను.
పాడే అందరు గాయకులైతే
అనుకోటానికి రచయితనేను.
పదాలకూడిక కవిత్వమైతే
నేనూ కూడా కవినౌతాను.
జీతం పొందకపోయుంటే
దేశ సేవలో సైనికుడందును
అందుకె మరి నేనుద్యోగుడ్ని
రక్షణ లక్ష్యపు ఖాకీ నేను.
కవిత గళమది నా కలమైతే!
‘తెలుగు రచన’మరి నేనే నేను.
 ఏరువాకలో నాగలి నేను
దున్నకపోతే దుంగన్నేను.
చదునూ,పదునూ,ఫలాలుకోరే
నేలను దున్నే వృషభం నేను.
విత్తులు,మొక్కలు,చెట్లైపోతే!
చీడకు చిలికే  చేదున్నేను.
పాడును మరిగిన ప్రభంజనంలో
మెరుగును గోరే మనిషిన్నేను.
తమస్సునందు ఉషస్సుగోరే
నూటపాతికా కోట్లమందిలో
ఒక్కడు నేను,ఒక్కడు నేను.
చెలిమిని గోరే తపస్సులోన
విజయం పొందిన తపస్వినేను.
తపస్సుగేలిచిన,  వరాలమాల
తెలుగు మిత్రులు. మీరే నేను !!

....య. వెంకటరమణ (హైదరాబాద్)

No comments:

Post a Comment